News March 16, 2025

గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

image

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

కరీంనగర్: ఒత్తిళ్లకు ‘నై’.. సమరానికి ‘సై’..!

image

కరీంనగర్(R) మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. MA, LLB చదివిన ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వస్తున్న ఒత్తిళ్లను సైతం ఆమె లెక్కచేయకుండా సమరానికి సై అంటున్నారు.

News December 3, 2025

4న మన్యంలో మంత్రి లోకేశ్ పర్యటన

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 4న భామిని మండలంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకోనున్నారు. 7 నుంచి 9 గంటల వరకు భామినిలో టీడీపీ కార్యకర్తలతో ముఖా ముఖిలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి బస చేసి మరుసటి రోజు స్థానిక ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్&టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.

News December 3, 2025

49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌‌లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in