News March 16, 2025

గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

image

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 23, 2025

సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

image

పర్యాటకుల సౌకర్యార్థం ఈనెల 29, 30 తేదీల్లో సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు RTC DM ప్రకాష్‌రావు తెలిపారు. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా సందర్శనకు 2 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.2,800 చార్జీగా నిర్ణయించామని, ఈనెల 29న మ.12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 23, 2025

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. ’10వ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి. వెనుకబడిన జుక్కల్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. DEO రాజు పాల్గొన్నారు.

News December 23, 2025

VHT: విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ

image

భారత స్టార్ క్రికెటర్లు విరాట్, రోహిత్ చాలాకాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. వీరిద్దరి ఆట చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ-ఏపీ మ్యాచ్ బెంగళూరులో, ముంబై-సిక్కిం మ్యాచ్ జైపూర్‌లో బుధవారం జరగనున్నాయి. ఈ 2 వేదికలలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్ట్‌కు బీసీసీఐ ఏర్పాట్లు చేయలేదు. NZతో ODI సిరీస్‌కు ముందు సన్నాహకాలుగా ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.