News March 16, 2025
గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
శరీరానికి కాపర్ అందితే కలిగే లాభాలు ఇవే!

శరీరానికి అవసరమైన కాపర్ అందితే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మతిమరుపు దరిచేరదు. వృద్ధులకు అల్జీమర్స్ ప్రమాదం ఉండదు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు, ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. క్యాన్సర్ సెల్స్ నాశనమవుతాయి. బాడీలో నుంచి ఫ్రీ రాడికల్స్ బయటకుపోతాయి.
News December 8, 2025
‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు

ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్గా ఫోకస్డ్గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్గా ₹1000CR వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.
News December 8, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.


