News March 16, 2025

గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

image

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 20, 2025

ఆ ఎమ్మెల్యేలు BRS భేటీకి వస్తారా?

image

TG: తాము INCలో చేరలేదని ఐదుగురు BRS MLAలు నివేదించడంతో వారిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే KCR ఆధ్వర్యంలో రేపు BRS కార్యవర్గం, LPల భేటీ జరగబోతోంది. పార్టీలోనే ఉన్నామని పేర్కొన్న ఆ MLAలు T.వెంకటరావు, A.గాంధీ, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు ఈ భేటీకి హాజరవుతారా? కారా? అన్నది ఆసక్తిగా మారింది. మిగతా సభ్యులు యాదయ్య, పోచారం, సంజయ్, నాగేందర్, కడియం రాక పైనా చర్చ సాగుతోంది.

News December 20, 2025

రబీ వరి సాగు.. ఎప్పటిలోగా విత్తుకోవాలి

image

APలో కొన్నిచోట్ల ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోతలు పూర్తైన భూముల్లో 125 రోజుల కాలపరిమితి గల వరి రకాలను ఇప్పటికే నాటుకోవాలి. ఒకవేళ ఎద పద్ధతిలో సాగు చేయాలనుకుంటే డిసెంబర్ 31 లోపు విత్తు కోవాలి. ఖరీఫ్ పంటకోత మరీ ఆలస్యమైతే 120 రోజుల కాల పరిమితి వరి రకాలను జనవరి మొదటి వారంలోపు ఎద పద్ధతిలో వేసుకోవాలి. దీని వల్ల రబీ వరి కోతలను ఏప్రిల్ 10లోపు పూర్తి చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 20, 2025

టీ20 ప్రపంచకప్‌ జట్టులో మన హైదరాబాదీ

image

భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో 68 సగటుతో కోహ్లీ రికార్డును దాటేసిన తిలక్ ఎంపికపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.