News March 16, 2025

గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

image

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

మాఫియాలను ఏలి ప్రభుత్వాలను పరిగెత్తించారు.. కానీ!

image

మెక్సికన్ డ్రగ్ కార్టెల్‌కు బాస్, ₹130కోట్ల రివార్డ్ ఉన్న ‘ఎల్ మెంచో’ <<19224610>>గర్ల్‌ఫ్రెండ్<<>> వల్ల దొరికి హతమయ్యాడు. లాటిన్ అమెరికా అండర్‌వరల్డ్ చరిత్రకు ఇది కొత్తేం కాదు. 2025లో లూయిస్ పికాడో భార్య చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో చిక్కాడు. 2022లో భార్య ఫేస్‌బుక్‌లో సెల్ఫీ పోస్ట్ చేయడం ఎల్ పిట్‌ కొంపముంచింది. ఇలా పెద్ద మాఫియాలను నడిపి ప్రభుత్వాలకు ఏళ్లుగా దొరకని వాళ్లు ప్రియురాళ్ల లింక్‌తో దొరికిపోతున్నారు.

News February 25, 2026

కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

image

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

News February 25, 2026

VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

image

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.