News December 18, 2024

గోపాలపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

గోపాలపురం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురంలో తారు లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చిన మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీల ముందు భాగాలు పూర్తిగా నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంగా నిర్లక్ష్యంగా లారీ రావడమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశామన్నారు.

News September 19, 2025

కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి అని, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్‌కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలన్నారు. కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.