News January 9, 2025
గోపాలపురం: ఐదుగురు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు

గోపాలపురం(M) కొమటిగుంట రైస్ మిల్లులో బయటపడిన అక్రమ PDS బియ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా మిల్లులో44 బస్తాల బియ్యం, లారీలో లోడ్ చేసున్న 580 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలువ రూ.14,31,111 ఉంటుందన్నారు. ఐదుగురు మిల్లు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లారీని సీజ్ చేశామన్నారు.
Similar News
News September 18, 2025
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.
News September 18, 2025
సంచలన చిత్రం మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి కుర్రాడే

హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉండి గ్రామానికి చెందినవారు. గ్రామ కరణం తాడికొండ లక్ష్మీ నరసింహం మనవడైన గౌర హరి, తన సంగీత ప్రతిభతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. 8చిత్రాలకు పైగా సంగీతం అందించగా, వీటిలో హనుమాన్, మిరాయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. గౌర హరిది ఉండివాడు కావడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.