News March 14, 2025
గోపాలమిత్ర కుటుంబీకులకు లక్ష ఆర్థిక సహాయం

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోపాలమిత్ర సభ్యులు ఈరోజు మృతుడి కుటుంబీకులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు పల్లెపాటి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి, రామస్వామి, సత్తార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.
Similar News
News March 22, 2025
మెదక్: ఫారెస్ట్లో బ్రిడ్జి కండిషన్ పరిశీలించిన కలెక్టర్

మెదక్- సిద్దిపేట్ నేషనల్ హైవేలో తొనిగండ్ల వద్ద ఫారెస్ట్లో బ్రిడ్జి కండిషన్ కలెక్టర్ రాహుల్ రాజ్పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని ఆధికారులు ఆదేశించిరు. కొత్తగా నిర్మించే బ్రిడ్జ్కు త్వరగా అన్నీ అనుమతులు తీసుకుని వేగంగా వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలన్నారు.
News March 22, 2025
మెదక్: కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు: అదనపు కలెక్టర్

పొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతనే యంత్రాలు వినియోగించి పంటలను కోయించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో సమావేశ హాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో యాసంగి వరి కోతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి కోతలు దగ్గర పడుతున్నందున హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్లో ఉండాలని, 18-20 మధ్యలో ఆర్పీయం ఉండాలన్నారు.
News March 22, 2025
మెదక్: జిల్లాలో రెండో రోజు టెన్త్ పరీక్షలు ప్రశాంతం

పదో తరగతి పరీక్షలు మెదక్ జిల్లాలో రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాల, పాఠశాల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,364 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది విద్యార్థులు 99.80 % గైర్హాజరయ్యారు.