News May 24, 2024
గోపాల్పేట: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో పెద్దలు మందలించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన గోపాల్పేట మండలం కేశంపేటలో శుక్రవారం జరిగింది. SI తిరుపతిరెడ్డి వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్(24) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియడంతో ఇంట్లో మందలించారు. దీంతో మల్లేశ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 13, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో ఆర్వోలది పాత్ర కీలకం’

పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం అన్నారు. నిన్న జడ్పీ ఆఫీసులో ROలు, AROలకు శిక్షణ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలది క్రియాశీలక పాత్ర అన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.
News February 13, 2025
బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్

బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.
News February 13, 2025
ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్తో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.