News March 11, 2025
గోలేటి ఏరియా స్టోర్లో చోరీ.. నలుగురు అరెస్ట్

గోలేటి ఏరియా స్పోర్ట్ చోరికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తాండూర్ CI కుమారస్వామి తెలిపారు. మందమర్రికి చెందిన మోతే రాజయ్య, నరసయ్య, తిరుపతి, మధు జనవరి 8న గోలేటి ఏరియా వర్క్ షాప్లోని సింగరేణి అధికారులు నిల్వ ఉంచిన పరికరాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ 6.22లక్షలు ఉంటుందన్నారు.
Similar News
News November 11, 2025
HYD: ఓటు వేసి ఈ పని చేయండి

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్ బూత్కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్ పెట్టి మీ ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్ డేట్. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.
News November 11, 2025
VKB: లగచర్ల ఘటనకు నేటికి ఏడాది

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్కు దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. హాజరైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్థులు అరెస్టు కావడంతో ఉద్రిక్తత కొనసాగింది.


