News July 7, 2024

గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులు

image

నేటి నుంచి చారిత్రక గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 75 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు నడుస్తాయి.

Similar News

News November 24, 2025

26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

image

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News November 24, 2025

HYDలో రూ.850 కోట్లు.. ఇందులో మీవీ ఉండొచ్చు!

image

1, 2 కాదు అక్షరాలా రూ.1,150 కోట్లు ఉన్నాయి తీసుకోండి అని వివిధ బ్యాంకుల అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలను కోరుతున్నారు. రూ.850 కోట్ల అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఈ 2 జిల్లాల్లోని బ్యాంకుల్లోనే ఉంది. హైదరాబాద్ జిల్లాలోని బ్యాంకుల్లో రూ.850 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులలో రూ.300 కోట్లు ఉన్నాయి. వచ్చేనెల 31లోపు ఖాతాదారులు, వారి నామినీలుగానీ ఈ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.
SHARE IT

News November 24, 2025

HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.