News August 8, 2024
గోల్కొండ కోటపై జెండా ఎగరవేయనున్న సీఎం రేవంత్

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తదితర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Similar News
News October 20, 2025
జూబ్లీహిల్స్: బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి చూపులేని వారి కోసం ప్రత్యేక ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను రూపొందించారు. అంతేకాక పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపిలోనే డమ్మీ బ్యాలెట్ షీట్ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్ని గమనించి వారు ఓటు వేయొచ్చని జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
News October 20, 2025
రోజుకు 213 మందికి జన్మనిస్తున్న హైదరాబాద్

హైదరాబాద్.. మహానగరం దాదాపు కోటి మంది జనాభా ఉన్న సిటీ.. ఇక్కడ రోజూ వందలాది మంది పురుడుపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనభ ఉన్న నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) నివేదికలో తేలింది. 2023వ సంవత్సరంలో సిటీలో 76,740 మంది జన్మించారు. అంటే సగటున నెలకు 6,395 మంది.. రోజుకు 213 మంది ఈలోకాన్ని చూశారన్న మాట.
News October 20, 2025
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్వెస్లీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.