News March 9, 2025
గోవాడలో ఈనెల 10న ధర్నా: ధర్మశ్రీ

చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈనెల 10న ధర్నా నిర్వహించనున్నట్లు వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు ధర్మశ్రీ తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీకి కోట్లాది రూపాయల నిధులను సమకూర్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిస్థితి దమనీయంగా ఉందన్నారు.
Similar News
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.
News November 24, 2025
ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.
News November 24, 2025
అత్యాచారం కేసులో వ్యక్తికి 12 ఏళ్ల జైలు: SP

2019లో గరివిడిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన బొండపల్లికి చెందిన సవిరిగాన సూర్యనారాయణకు విజయనగరం మహిళా కోర్టు 12 ఏళ్ల కఠిన కారాగార, శిక్ష రూ.2వేల జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. PP సత్యం వాదనలతో నిందితుడిపై నేరం రుజువైందన్నారు. దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.


