News March 9, 2025
గోవాడలో ఈనెల 10న ధర్నా: ధర్మశ్రీ

చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈనెల 10న ధర్నా నిర్వహించనున్నట్లు వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు ధర్మశ్రీ తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీకి కోట్లాది రూపాయల నిధులను సమకూర్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిస్థితి దమనీయంగా ఉందన్నారు.
Similar News
News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
News December 11, 2025
మొదలైన కౌంటింగ్.. గెలుపెవరిది.. తెలుసుకోండి

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. Way2Newsలో మీ లొకేషన్పై క్లిక్ చేసి ఊరు, వార్డు వారీగా కౌంటింగ్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా పొందండి.
News December 11, 2025
NZB: ముగిసిన పోలింగ్ సమయం

బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో GP ఎన్నికల పోలింగ్ 1 గంటతో ముగిసింది. అయితే కొన్ని గ్రామాల్లో ఇంకా కొందరు లైన్లో ఓటేసేందుకు ఉన్నారు. 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరి మీ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందా. కామెంట్ చెయ్యండి.


