News April 6, 2025
గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ!

సిరివెళ్ల మండలంలోని గోవింద పల్లె ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రస్తుతం దాడికి గురైన ప్రతాపరెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి గతంలో సిరివెళ్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి అతనితో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని 2017వ సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డిల తండ్రి నారాయణరెడ్డి కూడా 1987వ సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారు.
Similar News
News December 7, 2025
ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్పై ఛార్జిషీట్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.
News December 7, 2025
గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News December 7, 2025
ADB: ఏడాదికోసారి ఎలక్షన్ వస్తే ఎంత బాగుంటుందో..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ‘కాస్ట్లీ మందు కావాలి’, ‘వారసంతకు వెళ్లాలి’, ‘ఇంట్లో సామాన్ లేదు’ అంటూ అభ్యర్థులను డబ్బుల కోసం అడుగుతున్నారు. ఇక దావతులు, పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే ఇంట్లో దోకా ఉండదని, తమ ఖర్చులన్నీ వసూలు చేసుకోవచ్చని పలువురు బహిరంగంగా చెబుతున్నారు.


