News December 17, 2024
‘గోవు మృతి… ఊరు మొత్తం కంటతడి’
మూగ జీవి మృతితో ఊరు మొత్తం కంటతడిపెట్టిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లిలోని చోటుచేసుకుంది. గ్రామంలోని శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో భక్తులు ఆలయానికి గోవును బహూకరించారు. నిత్యం గ్రామస్థులు దానిని సొంత గోమాతగా భావించి ఇంటిలో ఉన్న పదార్థాలను అందిస్తూండేవారు. 4 రోజుల క్రితం హైవేపై బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో ఊరు మొత్తం కంటతడిపెట్టి.. ఘనంగా అంత్యక్రియలు చేశారు.
Similar News
News January 14, 2025
NLG: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
NLG: ఢిల్లీలో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు
తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో భారతి మండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్ మోడల్ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్ట్ ఎంపికైంది. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు లూనావత్ అఖిల్, బానోతు తరుణ్లను ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
News January 13, 2025
NLG: పండగ తర్వాత రంగంలోకి బృందాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.