News March 31, 2025

గోస్పాడు యువకుడికి ఉగాది పురస్కారం

image

గోస్పాడుకు చెందిన ఆవుల మల్లికార్జున అనే క్రీడాకారుడు జాతీయస్థాయి సీనియర్ పురుషుల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయనికి ఉగాది సంబరాల్లో భాగంగా క్రీడా ప్రోత్సాహకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల మానసిక ధైర్యం కలుగుతుందన్నారు.

Similar News

News February 26, 2026

మారిన మనుషులు.. స్నేహితులే వద్దంట!

image

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో ఫ్రెండ్‌షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్‌షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?

News February 26, 2026

ఇంటర్ ఎగ్జామ్స్: వరంగల్ జిల్లాలో ముగ్గురు డిబార్

image

వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో 191 మందికి 188 మంది హాజరయ్యారు. మోడల్ స్కూల్ సెంటర్‌లో 177 మంది విద్యార్థులకు గాను 174 పరీక్ష రాశారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆబ్సెంట్ అయ్యారు.

News February 26, 2026

తప్పెవరిది? శిక్ష ఎవరికి?

image

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.