News March 16, 2026

గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

image

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్‌ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Similar News

News April 13, 2026

భారత్‌ చేరుకున్న ఇరాన్ నౌకలు

image

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్‌ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.

News April 13, 2026

HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

image

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.

News April 13, 2026

కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

image

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.