News January 22, 2025
గ్రంథాలయాలు.. విజ్ఞాన కేంద్రాలు: మంత్రి పొంగులేటి

ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలను తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ పాషా, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
RMG: ‘అమృత్ పథకంలో స్వశక్తి మహిళలకు అవకాశం’

అమృత్ మిత్ర ఇన్షియేటివ్లో భాగంగా నీటి సరఫరా నిర్వహణ, నాణ్యత పరీక్ష, లీకేజీల మరమ్మతు వంటి పనుల్లో స్వశక్తి మహిళలకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్, RGM కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. అమృత్ 2.0 కింద రూ.65 లక్షలతో ఏడు ప్యాకేజీల పనులు స్వశక్తి సభ్యులతో చేపట్టి ఉపాధి కల్పిస్తామని, అవసరమైన శిక్షణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా అందిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు
News October 25, 2025
ఆసిఫాబాద్: సైబరాసురులతో జాగ్రత్త

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సైబర్ మోసగాళ్లు వినూత్న పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కాగజ్నగర్లో క్రెడిట్ కార్డుకు సంబంధించిన నకిలీ కాల్స్ ద్వారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.90 వేలు, ఒక ఉద్యోగి నుంచి రూ.70 వేలు, మరో చిరు వ్యాపారి నుంచి రూ.70 వేలు కొట్టేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 25, 2025
SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.


