News January 25, 2025
గ్రామసభలు గొడవలు లేకుండా జరిగాయా?: తాతా మధు

ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.
Similar News
News December 4, 2025
రెండో విడత ఎన్నికలు.. 894 నామినేషన్లు ఆమోదం.!

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. 6 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 894, వార్డులకు 4047 దాఖలైన నామినేషన్లను ఆమోదించినట్లు చెప్పారు. కామేపల్లి S-99 W-509, KMM(R) S-119 W-556, కూసుమంచి S-211 W-823, ముదిగొండ S-133 W-635, నేలకొండపల్లి S-133 W-640, తిరుమలాయపాలెం S-199 W-884 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} రెండో రోజు మూడో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News December 4, 2025
తొలి విడత ఎన్నికలు.. 438 నామినేషన్ల ఉపసంహరణ

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 438, వార్డులకు 556 మంది వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో 7 మండలాల్లో కలిపి 192 స్థానాల్లో సర్పంచ్, 1740 స్థానాల్లో వార్డుల పదవికి ఎన్నికలు జరగనున్నాయి.


