News January 25, 2025

గ్రామసభలు గొడవలు లేకుండా జరిగాయా?: తాతా మధు

image

ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో  తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.

Similar News

News January 3, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

image

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2026

ఖమ్మం: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు

image

ఖమ్మం నగరంలో టెట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని తెలిపారు. ఉ.9 నుంచి 11 వరకు ఒక సెషన్, మ.2 నుంచి సా.4:30 వరకు మరో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కాగా పరీక్షలకు మొత్తం 20,547 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

News January 3, 2026

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
☆ సత్తుపల్లి (మం) రామానగరంలో నేడు రక్తదాన శిబిరం
☆ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ పక్రియ
☆ జిల్లాలో పర్యటించనున్న కలెక్టర్ అనుదీప్
☆ ఖమ్మంలో నేటి నుంచి టెట్ పరీక్షలు
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన