News January 25, 2025
గ్రామసభలో చదివిన పేర్లు దరఖాస్తుదారులవే: ASF అడిషనల్ కలెక్టర్

గ్రామ సభలో చదివిన పేర్లు దరఖాస్తుదారుల మాత్రమే అర్హుల జాబితా కాదని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కైర్గావ్ గ్రామంలో ఎంపీడీవో శంకరమ్మ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ఇది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అని అర్హులది కాదన్నారు. జాబితాలో పేరు లేని వారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.
Similar News
News October 17, 2025
TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.
News October 17, 2025
దీపావళి 5 రోజుల పండుగ అని మీకు తెలుసా?

దీపావళిని మనం రెండ్రోజులే జరుపుకొంటాం. కానీ ఉత్తర భారత్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ ద్వితీయ వరకు.. మొత్తం 5 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. త్రయోదశి నాడు ధన్తేరస్గా కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. 14వ తిథిన నరక చతుర్ధశి, అమావాస్య రోజు దీపావళి జరుపుకొంటారు. పాడ్యమి రోజున గోవర్ధన పూజ చేసి, బలి చక్రవర్తిని పూజిస్తారు. ద్వితీయ తిథిన భాయ్ దూజ్ వేడుకలుంటాయి.
News October 17, 2025
NRML: 42 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రాని మోహన్ రెడ్డి

మావోయిస్టు పార్టీలోనూ మోహన్ రెడ్డి టెక్నికల్ విభాగంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గాను కొనసాగారు. ఎంత పెద్ద నాయకుడైనా కుటుంబాన్ని, పెరిగిన ఊరిని చూడటానికి అప్పడప్పుడొచ్చిపోతుంటారని విన్నాం. కానీ 42 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన 63 ఏళ్ల మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన గ్రామానికి రాలేదు. ఇప్పుడైనా వస్తారేమో చూడాలి మరి.