News January 31, 2025

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తా: ధర్మశ్రీ

image

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేస్తానని నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు స్వీకరించిన కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం కశింకోటలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందని అన్నారు. ధర్మశ్రీని మాజీ మంత్రులు బొత్స, అంబటి, గుడివాడ, ముత్యాల నాయుడు తదితరులు అభినందించారు.

Similar News

News December 4, 2025

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

News December 4, 2025

సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

image

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 4, 2025

సంక్రాంతి శోభలా మెగా పీటీఎం నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

image

మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు విద్యాసంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభ, వారిలో ఉన్న సామర్ధ్యాలను ప్రదర్శించాలన్నారు.