News March 30, 2025
గ్రీన్ఫీల్డ్తోనే కొత్తగూడెం ఎయిర్పోర్టు ఆలస్యం: తుమ్మల

ఆగస్టు 15 నాటికి ఖమ్మం-రాజమండ్రి రోడ్డు అందుబాటులోకి రాబోతుందని, గ్రీన్ఫీల్డ్ కావడంతో కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ ఆలస్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు లబ్ధి చేకూరేలా ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అటు భద్రాద్రి రామాలయ అభివృద్ధికి CM మొదటి దశ కింద భూసేకరణకు రూ.34 కోట్లు మంజూరు చేసిందనుకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News April 17, 2025
ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
News April 17, 2025
నారాయణపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: ఎస్పీ

పదోన్నతులు ఉద్యోగుల బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. కానిస్టేబుల్గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన శివారెడ్డికి గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్యాడ్జి తొడిగించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ నరసింహ పాల్గొన్నారు.
News April 17, 2025
వైవీయూకు రూ.10 కోట్లు

కడప: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవీయూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పార్టనర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిసి రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థలతో కలసి వైవీయూ రీసెర్చ్ చేస్తుందని వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు.