News January 12, 2025
గ్రీన్ కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ

కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్ కో కంపెనీ గురించి వివరించారు.
Similar News
News February 16, 2025
తుగ్గలి: ఒకటే చెట్టు.. రెండు విభిన్నతలు

తుగ్గలి మండలం రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలోని ఓ చింత చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. చెట్టు ఓ వైపు ఆకులు ఎండిపోయి కనిపిస్తుంటే, మరో వైపు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది. రెండు వర్ణాలతో దర్శనమిస్తున్న చెట్టు ఆ మార్గం గుండా వెళ్లే చూపరులను, వాహనదారులను, రైతులను ఆకట్టుకుంటోంది.
News February 16, 2025
నంద్యాల జిల్లాలో నవజాత శిశువు లభ్యం

సిరివెళ్ల మండలం జునెపల్లె ఎస్సీ కాలనీలో నవజాత శిశువు లభ్యం అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ వ్యక్తి కూలీలను పనికి పిలుస్తుండగా ఖాళీ స్థలం నుంచి శిశువు ఏడుపును గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆడ శిశువుగా గుర్తించాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వైద్యం నిమిత్తం శిశువును తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టారు.
News February 16, 2025
కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్టంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.