News March 12, 2025
గ్రూప్-01లో సత్తా చాటిన హుజూర్నగర్ తహశీల్దార్

హుజూర్నగర్ తహశీల్దార్గా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -01 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి 2011లో గ్రూప్-02కు ఎన్నికై డిప్యూటీ తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత తహశీల్దార్గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News November 24, 2025
వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
News November 24, 2025
బాపట్ల: మాంసం దుకాణాల్లో మోసాలు..!

బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడులోని మాంసం దుకాణాలను తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో కాటాలకు సరైన ముద్రలు లేనట్లు గుర్తించారు. వారికి రూ.9 వేలు ఫైన్ వేశారు. కొలతల్లో లోపాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు కచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందజేయాలని ఆదేశించారు. మీ దగ్గర తూకాల్లో మోసం జరుగుతుందా? కామెంట్ చేయండి.


