News March 12, 2025

గ్రూప్-01లో సత్తా చాటిన హుజూర్‌నగర్ తహశీల్దార్

image

హుజూర్‌నగర్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -01 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి 2011లో గ్రూప్-02కు ఎన్నికై డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత తహశీల్దార్‌గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News December 1, 2025

ఆఖరి రాగం పాడేద్దామా..!

image

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్‌గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్‌లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్‌కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్‌గా కలుద్దాం.

News December 1, 2025

జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి 31 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.