News March 31, 2025

గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

image

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 28, 2025

GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.

News November 28, 2025

ప.గో: టీచర్‌గా మారిన కలెక్టర్ చదలవాడ

image

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులతో మమేకమై ఆమె కొద్దిసేపు టీచర్‌గా మారారు. గడిచిపోయిన రోజు తిరిగి రాదని, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలని హితవు పలికారు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని ఆమె కోరారు.

News November 28, 2025

గద్వాల: పదవుల వేలం వేస్తే కఠిన చర్యలు: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేలం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఎన్నికల నేరాలుగా పరిగణించబడతాయని, వీటికి సెక్షన్ 171-E, 171-F ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.