News March 31, 2025

గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

image

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.

News December 1, 2025

GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

image

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

News December 1, 2025

సిద్దిపేట: ఇద్దరు ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ

image

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిపోర్టు పంపించనందున ఇద్దరు ఎంపీఓలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగదేవపూర్ ఎంపీఓ ఖాజా మోహినోద్దీన్, ములుగు ఎంపీఓ కలీంలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రిపోర్టు సరైనదిగా పంపనందున షోకాజ్ జారీ చేసినట్లు తెలిపారు.