News March 31, 2025

గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

image

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 18, 2025

సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

image

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.

News November 18, 2025

సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

image

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.

News November 18, 2025

హిడ్మా మృతదేహం (photo)

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.