News March 31, 2025

గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

image

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 24, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేశ్ (19) మిత్రులతో కలిసి అలల్లో స్నానం చేస్తూ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అధికారులు నిన్నటి నుంచి గాలిస్తుండగా సోమవారం మోళ్లపర్రులో బీచ్‌లో లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

పార్వతీపురం: స్నేహితుడి పెళ్లి కోసం వచ్చి.. విగత జీవివులుగా మారారు

image

జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో ఉన్న మరికొందరి స్నేహితులతో కలిసి మధ్యాహ్నం జంఝావతి రబ్బర్ డాంను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు శరత్ కుమార్, ప్రతాప్, గోవింద నాయుడు దిగి ఊబిలో కూరుకుపోయి మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.