News March 31, 2025
గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 15, 2025
MHBD: లిక్కర్ షాపులకు 168 దరఖాస్తులే!

జిల్లాలో ఉన్న 61 లిక్కర్ షాపులకు మొత్తం 168 దరఖాస్తులు వచ్చినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. బుధవారం 44 మద్యం దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉందన్నారు. మద్యం దరఖాస్తులు ఈనెల 18వ తేదీతో గడువు ముగుస్తుందని మహబూబాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.
News October 15, 2025
ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
News October 15, 2025
సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>