News March 31, 2025

గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

image

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 4, 2025

ఒక్క సాంగ్ వాడినందుకు ఇళయరాజాకు ₹50 లక్షలు చెల్లింపు!

image

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా ‘Dude’ సినిమాపై వేసిన కాపీరైట్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా వాడారని ఆయన చిత్రయూనిట్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ పరిష్కరించుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ సాంగ్ ఉపయోగించినందుకు రూ.50లక్షలు చెల్లిస్తామని ఇళయరాజాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి.

News December 4, 2025

రష్యాతో స్నేహం.. ఎన్ని ఒత్తిళ్లున్నా డోంట్‌కేర్!

image

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా. అందుకే US నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా రష్యాతో ఒప్పందాల విషయంలో ఇండియా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెక్యూరిటీ, డిఫెన్స్, ఎనర్జీ, ట్రేడ్, పెట్రోలియం రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇవి పాక్, చైనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

News December 4, 2025

ఆదిలాబాద్‌కు ఎయిర్‌‌బస్ తెస్తాం: CM రేవంత్

image

TG: అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని CM రేవంత్ పేర్కొన్నారు. ‘ఆదిలాబాద్‌కూ ఎయిర్‌పోర్టు కావాలని MLA పాయల్ శంకర్ నాతో అన్నారు. ఇదే విషయం నిన్న ఢిల్లీలో PM మోదీతో మాట్లాడాను. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్‌బస్ తీసుకొచ్చి.. కంపెనీలు నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా’ అని తెలిపారు.