News April 1, 2025
గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట బిడ్డ

నారాయణపేట జిల్లా కేంద్రం యాదవనగర్కు చెందిన వీణ గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో మల్టీ జోన్-2 లో మూడో ర్యాంక్ సాధించింది. ఆమె మొదట 2024లో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఎంపికైంది. 2025లో జూనియర్ లెక్చరర్గా ఎంపికై ప్రస్తుతం గోల్కొండ మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 3, 2025
మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
News December 3, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్
News December 3, 2025
WGL: అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్..!

జిల్లాలోని దుగ్గొండి మండలం బంధంపల్లిలో సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీగా రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ములుగు మాజీ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ సర్పంచ్గా పోటీకి నామినేషన్ పంపించారు. ఆన్లైన్లో ఫారం డౌన్లోడ్ చేసుకుని సంతకం చేసిన ఆయన, స్పీడ్ పోస్టు ద్వారా రిటర్నింగ్ అధికారి భద్రమ్మకు చేరేలా పంపించారు. లక్ష్మారెడ్డి భార్య సుభద్ర 2013-18లో ఇదే గ్రామానికి సర్పంచ్గా పని చేశారు.


