News April 1, 2025
గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట బిడ్డ

నారాయణపేట జిల్లా కేంద్రం యాదవనగర్కు చెందిన వీణ గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో మల్టీ జోన్-2 లో మూడో ర్యాంక్ సాధించింది. ఆమె మొదట 2024లో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఎంపికైంది. 2025లో జూనియర్ లెక్చరర్గా ఎంపికై ప్రస్తుతం గోల్కొండ మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 10, 2025
బాపట్లలో ఉచిత DSC కోచింగ్

DSC రిక్రూట్ మెంట్-2025 పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ కోసం అర్హులైన బాపట్ల జిల్లాకు చెందిన BC, EBC, SC, ST కులాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం తెలిపారు. చిన్నగంజాం మండల పరిధిలోని అభ్యర్థులు బాపట్లలో వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు వివరించారు.
News April 10, 2025
15న చిత్తూరు ఐటీఐలో అప్రెంటిస్ మేళా

చిత్తూరు ఐటీఐలో ఈనెల 15న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఐబీఎం ఓచర్లో నమోదు చేసుకోవాలన్నారు.
News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.