News March 12, 2025

గ్రూప్-2లో ర్యాంక్ సాధించిన మహబూబాబాద్ SI

image

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ గ్రూప్-2 ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో యువకులు సత్తా చాటారు. పట్టణంలో టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న శివకుమార్ స్టేట్ వైడ్ 25వ ర్యాంకు సాధించి మహబూబాబాద్‌లో టాప్‌గా నిలిచారు. ఓవైపు ఎస్ఐగా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలకు చదివి టాప్ ర్యాంక్ సాధించడంతో జిల్లాలోని పలువురు ఎస్సై శివకుమార్‌ను అభినందిస్తున్నారు.

Similar News

News October 23, 2025

ANU: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860లు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News October 23, 2025

మ్యూజిక్ డైరెక్టర్ సబేశన్ కన్నుమూత

image

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ MC సబేశన్(68) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో మరణించారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ దేవా సోదరుడే సబేశన్. తన మరో సోదరుడు మురళీతో కలిసి దేవా వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. తర్వాత సబేశన్-మురళి జోడీ పాపులరైంది. పొక్కిషమ్, కూడల్ నగర్, మిలగ, గొరిపలయమ్, 23వ పులకేశి, అదైకాలమ్, పరాయ్ మొదలైన చిత్రాలకు సంగీతం అందించింది. రేపు చెన్నైలో సబేశన్ అంత్యక్రియలు జరుగుతాయి.

News October 23, 2025

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

image

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.