News March 14, 2025

గ్రూప్-2లో 11వ ర్యాంకర్‌కు కలెక్టర్ సన్మానం

image

తెలంగాణ గ్రూప్-2లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించిన మోత్కూర్‌కు చెందిన గుర్రం సాయి కృష్ణారెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అభినందించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సాయి కృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృషితో ఉన్నత ర్యాంక్ సాధించడం యువతకు ప్రేరణ అని ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు వీరారెడ్డి, ఏవో జగన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

నేతివానిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా తిరుపతమ్మ నామినేషన్

image

మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సహకరించాలని కోరారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికి ఓటు వేయాలన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.