News December 15, 2024
గ్రూప్ 2 ఎగ్జామ్: HYDలోని లైబ్రరీలు ఖాళీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734234611321_50206943-normal-WIFI.webp)
గ్రూప్ 2 ఎగ్జామ్తో HYDలోని లైబ్రరీలు, స్టడీ హాల్స్ వెలవెలబోయాయి. ఎప్పుడూ విద్యార్థులతో కళ కళలాడే చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీగా దర్శనమిచ్చింది. రేపు కూడా పరీక్ష ఉంది. తమ సొంత జిల్లాలోనూ సెంటర్లు ఉండడంతో అభ్యర్థులు ఒకరోజు ముందే ప్రయాణమయ్యారు. ఈ ప్రభావంతో అశోక్నగర్, దిల్సుఖ్నగర్ తదితర కోచింగ్ సెంటర్ల వద్ద హడావిడి తగ్గింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Similar News
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750338333_52296546-normal-WIFI.webp)
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
News February 5, 2025
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738748130517_51149288-normal-WIFI.webp)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738736231326_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.