News March 15, 2025
గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీరనేని రాజశేఖర్ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 287 ర్యాంకు, గ్రూప్-3 ఫలితాల్లో 86 రాంక్ సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వేలో ఉద్యోగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ కూడా విధులు నిర్వర్తించారు. దీంతో తల్లిదండ్రులు చంద్రయ్య, రాజవ్వ, గ్రామస్థులు రాజశేఖర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 27, 2025
HYD: BRSలోకి BJP మాజీ కార్పొరేటర్

చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెకు BRS సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ స్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తదితరులు నవతారెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న ఆదివారం తెలంగాణ భవన్లో KTR సమక్షంలో ఆమె BRSలో చేరనున్నట్లు వెల్లడించారు.
News October 27, 2025
HYD: BRSలోకి BJP మాజీ కార్పొరేటర్

చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెకు BRS సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ స్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తదితరులు నవతారెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న ఆదివారం తెలంగాణ భవన్లో KTR సమక్షంలో ఆమె BRSలో చేరనున్నట్లు వెల్లడించారు.
News October 27, 2025
సంగారెడ్డి: చెరువులో యువతి మృతదేహం లభ్యం

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు చెరువులో మృతదేహాన్ని చూసి సమాచారం అందించారు. మృతురాలు హైదరాబాద్లోని బాలాపూర్కు చెందిన ఫాతిమా(27)గా మృతదేహం వద్ద లభించిన ఆధారాల ద్వారా గుర్తించినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


