News February 21, 2025
గ్రూప్-2 పరీక్షలకు 7 కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని, ఏవైనా సందేహాలు ఉంటే 8801188046 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 25, 2025
ప్రకాశం: DSC అభ్యర్థులకు GOOD NEWS

ప్రకాశం జిల్లాలోని EBC, BC అభ్యర్థులకు మెగా DSC-2025కి ఆన్లైన్ ద్వారా, ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ BC స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకురాలు అంజలి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. అన్నింటితోపాటు 2 పాస్ ఫొటోలను కలిపి ఒంగోలులోని ఏపీ BC స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు. ధరఖాస్తులు 10వ తేదీనే ప్రారంభం అయినట్లు తెలిపారు.
News March 25, 2025
ఒంగోలు: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీపీఎస్సీ పరీక్ష జరుగుతున్న ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్, సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
News March 25, 2025
ఒంగోలు: మాజీ సీఎం జగన్తో జిల్లా వైసీపీ నేతల సమావేశం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ను కలిశారు. జిల్లా నాయకులతో వైసీపీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ చర్చించారు. జగన్ను కలిసిన వారిలో జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దద్దాల నారాయణ ఉన్నారు.