News December 10, 2024
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్

గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.
Similar News
News October 15, 2025
నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
News October 15, 2025
నిజామాబాద్: బీసీ బంద్కు సీపీఎం మద్దతు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు ఆరోపించారు. బుధవారం బీసీ జేఏసీ నాయకులు కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్కు మద్దతు కోరగా, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల తీర్మానానికి కేంద్రం తక్షణమే ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్ను విజయవంతం చేయాలని రమేష్బాబు కోరారు.
News October 15, 2025
NZB: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: బస్వా లక్ష్మీనర్సయ్య

వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కమీషనర్ను బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు