News March 12, 2025
గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

బజార్హత్నూర్కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్సీసీఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News November 22, 2025
ADB: కారు జోరు.. కాంగ్రెస్ ఇలా.. బీజేపీ డీలా..!

రాష్ట్రంలో అన్ని ప్రధాన ఎన్నికల్లో ఓటమి చూసిన కారు పార్టీ ADBలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. తరచూ వివిధ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటోంది. అభివృద్ధి తమ మంత్రమని కాంగ్రెస్ వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలు అంతంతగానే ఉన్నాయి. ఇక బీజేపీ హిందుత్వపరంగా బలంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు అంతగా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 22, 2025
ADB: స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పలు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈవో రాజలింగు పేర్కొన్నారు. యువత సంక్షేమార్గం నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అర్హత గల సంస్థలు ngodarpan.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టెప్ కార్యాలయంలో ఈనెల 30లోపు సమర్పించాలని సూచించారు.


