News March 15, 2025
గ్రూప్ 2, 3 ఫలితాల్లో మంచిర్యాల యువకుడి సత్తా

గ్రూప్ 2,3 ఫలితాల్లో మంచిర్యాల ఆర్ఆర్ నగర్కు చెందిన మండల సుమంత్ గౌడ్ సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. కాగా గతంలో విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 172 ర్యాంకు సాధించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.
Similar News
News April 20, 2025
ఆకాశంలో స్మైలీ.. 25న అద్భుతం

ఈ నెల 25న ఆకాశం మనల్ని నవ్వుతూ పలకరించనుంది. ఆ రోజున ఉ.5.30 సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెల వంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో స్మైలీ ఫేస్ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. రెండు గ్రహాలు కాంతివంతంగా ఉంటాయి కాబట్టి కంటితోనే చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని తెలిపింది.
News April 20, 2025
కడప: మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా

ఉమ్మడి కడప జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయితుల్లా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తిలకి చేరేలా పని చేస్తానని ఆయన తెలిపారు.
News April 20, 2025
మేదరమెట్ల: ఒంటరి మహిళలే వీరి టార్గెట్

అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు <<16152529>>అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే<<>>. ప్రకాశం(D) ఈతమొక్కలకు చెందిన ఏడుకొండలు, ఆషిద్ వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసులు దొంగలిస్తున్నారని DSP తెలిపారు. చీమకుర్తి, కొత్తపట్నం, టంగుటూరు, కొనకనమిట్ల, ఒంగోలు, మేదరమెట్లలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారన్నారు. శనివారం మేదరమెట్లలో వీరిని అరెస్టు చేసి 126 గ్రా.ల 5చైన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.