News March 15, 2025

గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

image

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.

Similar News

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

image

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.

News November 15, 2025

రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

image

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.