News March 15, 2025
గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.
Similar News
News September 16, 2025
బేగంపేట ఎయిర్పోర్ట్లో రేపు ప్రయాణికుల సేవా దినోత్సవం

బేగంపేట విమానాశ్రయంలో రేపు ప్రయాణికుల సేవా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ కో-ఆర్డినేషన్ ఇన్ఛార్జ్ అచింత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, పిల్లల కోసం పెయింటింగ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థులకు విమానయాన రంగంలోని ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
News September 16, 2025
విజయవాడ: అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS)- తిరువణ్ణామలై(TNM) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ మేరకు నం.07219 NS- TNM రైలును OCT 1, 8, 22 & NOV 5, 19, 26న నడుపుతామని, నం.07220 TNM- NS రైలును OCT 2, 9, 23 & NOV 6, 20, 27న నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయన్నారు.
News September 16, 2025
HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.