News March 15, 2025
గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.
Similar News
News April 12, 2026
కర్నూలు: యవకుడు, మహిళ సూసైడ్

కర్నూలు(D) దేవనకొండ మండలానికి చెందిన మహిళ, యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నారు. అలారుదిన్నెకు చెందిన రంగస్వామి(21), ఉరుకుందకు చెందిన ప్రమీల(23) దంపతులమని చెప్పి 2 నెలల క్రితం కడప(D) ప్రొద్దుటూరు(M) లింగాపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రంగస్వామి చదువుతుండగా, ప్రమీలకు ఇదివరకే వేరే వ్యక్తితో వివాహమైంది. భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి రంగస్వామితో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఉరేసుకున్నారు.
News April 12, 2026
VJA: టాయిలెట్లో కన్నబిడ్డను వదిలి వెళ్లిన సాఫ్ట్వేర్ దంపతులు!

విజయవాడ కృష్ణలంక మున్సిపల్ టాయిలెట్స్లో ఓ మహిళ <<19626479>>ఆడపిల్లకు జన్మనిచ్చి వదిలేసిన ఘటన <<>>తెలిసిందే. గోదావరి జిల్లా దంపతులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ బాయ్, స్వీపర్గా పని చేస్తూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో బిడ్డను పెంచలేక బస్ స్టాండ్ నుంచి టాయిలెట్కు వెళ్లి డెలివరీ చేసి వదిలేశారు. సీసీ కెమెరాల సాయంతో పోలీసులు అరెస్టు చేశారు. పాప ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉంది.
News April 12, 2026
బాపట్ల: దారుణం.. అర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ హత్య?

బాపట్ల (D) అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోరం జరిగింది. RMP డాక్టర్ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే సీఐ సుబ్బరాజు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


