News November 15, 2024

గ్రూప్-3 పరీక్షకు 88 కేంద్రాలు ఏర్పాటు: జేసీ శ్రీనివాస్

image

ఈనెల 17, 18 రెండు రోజులు గ్రూప్-3 పరీక్షలు ఉంటాయని, జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జేసీ శ్రీనివాస్ తెలిపారు. నల్గొండలో 60, మిర్యాలగూడలో 28, మొత్తం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 28,353 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ తేదీ పేపర్ -1 ఉదయం 10 గంటలకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

Similar News

News November 27, 2025

నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

News November 27, 2025

NLG: మాజీ సైనికుల పిల్లలకు గుడ్ న్యూస్

image

మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.krb.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682-224820 నంబర్ కు సంప్రదించాలని కోరారు.

News November 27, 2025

NLG: రెండు డివిజన్లు.. 117 క్లస్టర్లు!

image

నల్లగొండ, చండూరు డివిజన్లో పరిధిలో 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.