News November 24, 2024
గ్రేటర్ హైదరాబాద్లో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు

హుమయూన్నగర్లోని తెలంగాణ మైనార్టీ పాఠశాల బాలుర -1ను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, స్టోర్రూమ్, పడకగదులు, ప్రొవిజన్స్, హాస్టల్ రిజస్టర్లను పరిశీలించారు. పిల్లలతో కలసి ఆయన టిఫిన్ చేశారు. టిఫిన్స్ ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణ బాగుందని ఆయన ప్రశంసించారు.
Similar News
News November 26, 2025
గాంధీ ఆస్పత్రిలో యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స

భూపాలపల్లి జిల్లా యువకుడు విజయ్కుమార్కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ & అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. విషం తాగిన తర్వాత ఏర్పడిన సబ్గ్లోట్టిక్ ట్రాకియల్ స్టెనోసిస్ సమస్య తీవ్రం కావడంతో ఈ నెల 12న సీటీవీఎస్, ENT విభాగాల వైద్యులు కలిసి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. సీటీవీఎస్ డా.జి. రవీంద్ర, ENT డా. భూపేందర్ రాథోడ్లను సూపరింటెండెంట్ డా.వాణి అభినందించారు.
News November 26, 2025
GHMCలో విలీనం.. తర్వాత బాదుడే.. బాదుడు

GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అధికారికంగా ముగిసిన అనంతరం ఆయా ప్రాంతాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పన్నులు పడే అవకాశముంది. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విధి, విధానాలు ప్రభుత్వం ఇంకా పూర్తిగా రూపొందించలేదు. విలీన ప్రక్రియ సమగ్రంగా ముగిసిన తర్వాత పన్నుల లెక్క తేలుతుంది. దీనిపై మీ కామెంట్
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.


