News March 6, 2025

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

image

జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ సి.విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం నందివర్గంలో జరుగుతున్న రీ సర్వే పనుల ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజూ 25 ఎకరాలకు మించకుండా రీసర్వే నిర్వహించాలన్నారు. గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియ, విస్తీర్ణ కొలతలను అడిగి తెలుసుకుని సిబ్బందికి సూచనలు చేశారు.

Similar News

News January 11, 2026

కామారెడ్డి: ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మూడు రోజులుగా జరిగిన కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ప్రత్యేక అధికారులకు పలు అంశాలపై మూడు రోజుల పాటు అవగాహన కల్పించారు. చివరి రోజు ప్రత్యేక అధికారులు పలు రకాల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

News January 11, 2026

NZB: ‘నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు’

image

CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు.

News January 11, 2026

తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

image

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.