News February 18, 2025

ఘట్కేసర్ కొండాపూర్‌లో అనుమానాస్పద మృతి

image

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ PS పరిధి కొండాపూర్ సమీపంలోని ఓ కల్వర్టు వద్ద రూపాని వెంకన్న(49) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మృతుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం పని కోసం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు వచ్చిన రూపాని వెంకన్న మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News November 22, 2025

ఓపెనర్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ.. వార్నర్ సరసన హెడ్

image

ENGతో తొలి టెస్టులో 69బంతుల్లోనే సెంచరీ చేసిన AUS ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా వచ్చి వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా వార్నర్ సరసన నిలిచారు. 2012లో INDపై వార్నర్ 69బాల్స్‌లోనే సెంచరీ కొట్టారు. ఇక ఛేజింగ్‌లో 4వ ఇన్నింగ్స్‌లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా, ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ శతకం బాదిన 8వ బ్యాటర్‌గా హెడ్ నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో మెక్‌కల్లమ్ ఉన్నారు. ఆయన AUSపై 54బంతుల్లోనే సెంచరీ కొట్టారు.

News November 22, 2025

SRCL: ‘ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి’

image

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరంటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్ దాస్ పేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తనిఖీ చేశారు.

News November 22, 2025

పూలు, సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి సారించాలి: ప్రేమ్ సింగ్

image

నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి, DPT డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ప్రేమ్ సింగ్ శనివారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్, డ్రిప్, పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం పథకాల అమలును ఆయన పరిశీలించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పూలు, సుగంధ ద్రవ్యాల సాగును పెంచాలని సూచించారు. రైతులకు డ్రిప్ పరికరాలను సకాలంలో అందించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.