News February 18, 2025

ఘట్కేసర్ కొండాపూర్‌లో అనుమానాస్పద మృతి

image

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ PS పరిధి కొండాపూర్ సమీపంలోని ఓ కల్వర్టు వద్ద రూపాని వెంకన్న(49) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మృతుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం పని కోసం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు వచ్చిన రూపాని వెంకన్న మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News December 3, 2025

సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

image

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.

News December 3, 2025

శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

image

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.