News November 26, 2024
ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు

గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
Similar News
News October 24, 2025
గుర్తింపు ఫీజు, హరిత నిధి చెల్లించాలి: డీఐఈఓ

జిల్లాలోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు గుర్తింపు ఫీజు చెల్లించాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో సంబంధిత కాలేజ్ లాగిన్ ద్వారా “రికగ్నైజేషన్ ఫీజు” తప్పక చెల్లించాలని, విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్ లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO సూచించారు.
News October 24, 2025
కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలి: MP కావ్య

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రాజెక్టుల పురోగతిపై వరంగల్ కలెక్టర్ సత్యశారదదేవితో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమావేశం అయ్యారు. వరంగల్ జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ చేసి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.
News October 22, 2025
హనుమకొండలో ధాన్యం అక్రమాలు

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.


