News February 25, 2025
ఘన్పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 9, 2025
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మధురువాడ ఐటీ హిల్స్పై సందర్శించిన ఆయన కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్రమంలో అక్కడి హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.
News December 9, 2025
ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ను వినియోగించుకోవాలన్నారు.


