News March 23, 2025
ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో ఖమ్మం-అశ్వారావుపేట NHపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా లారీ, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆరు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దమ్మపేట పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.
News April 20, 2025
DSC: అనంతపురం జిల్లాలో పోస్టులు ఇలా..

అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులను <<16155926>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 37
➤ హిందీ: 28 ➤ ఇంగ్లీష్: 103
➤ గణితం: 43 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 72 ➤ సోషల్: 111
➤ పీఈటీ: 145 ➤ఎస్జీటీ: 202 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్జీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.