News March 24, 2025

ఘోర ప్రమాదం.. తమిళనాడులో కడప యువకులు మృతి

image

దైవదర్శనానికి వెళ్తున్న కడప యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన నాగేంద్ర(31), శేషాచలం(29) ఆదివారం తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి దర్శనానికి బైకుపై వెళ్లారు. రాణీపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కంటైనర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడ్డారు. అదే సమయంలో వచ్చిన కారు వారిపై వెళ్లింది. దీంతో ఇద్దరి శరీరాలు చిధ్రమై స్పాట్‌లో మృతి చెందారు.

Similar News

News March 31, 2025

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. MI తరఫున అశ్వనీ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.
MI: రికెల్టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధిర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్
KKR: డీకాక్, అయ్యర్, రహానే, రింకూ, రఘువంశీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, జాన్సన్, రాణా, వరుణ్ చక్రవర్తి

News March 31, 2025

రేపు లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 7.00 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సచివాలయం సిబ్బంది, డీఎల్డీఓలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

News March 31, 2025

రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

image

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.

error: Content is protected !!