News April 14, 2025
ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 12, 2025
వనపర్తి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు -ఎస్పీ

వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనుండడంతో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపూర్, అమరచింత మండలాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీత రెడ్డి స్పష్టం చేశారు.
News December 12, 2025
సిద్దిపేట: సీపీతో ‘ఫోన్ ఇన్’ రద్దు

ప్రతి శనివారం సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేస్తున్నట్లు కమిషనరేట్ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వివరించింది. తదుపరి ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం డిసెంబర్ 20 రోజున యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొంది.
News December 12, 2025
నెల్లూరు: నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ క్లోజ్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మతు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు.


