News April 14, 2025
ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 4, 2025
చంద్రబాబును బొక్కలో పెట్టాలి: జగన్

AP: చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి. ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు అంటూ మోసం చేశారని.. ఉచిత బస్సుకు ఎన్నో నిబంధనలు పెట్టారని ఫైరయ్యారు. నాడు-నేడును పూర్తిగా ఆపేసి, ఇంగ్లిష్ మీడియాన్ని తీసేశారని విమర్శించారు.
News December 4, 2025
WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.
News December 4, 2025
ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.


