News April 14, 2025
ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News October 15, 2025
ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. ఖమ్మం నుంచే షురూ..!

ప్రభుత్వం పచ్చదనంతో పాటు ఆదాయం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో ప్రభుత్వ స్థలాలు, రహదారులు, బీడు భూముల్లో ఆయిల్పామ్ మొక్కలు పెంచి పచ్చదనంతో పాటు ఆదాయం పొందేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంను మోడల్గా తీసుకుని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ స్థలాల్లో మొక్కలను నాటడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదాయం లభించనుంది.
News October 15, 2025
లెగ్గింగ్స్ కొంటున్నారా?

అందుబాటు ధరల్లో, డిజైన్లలో వచ్చే లెగ్గింగ్స్ రోజువారీ ఫ్యాషన్తో భాగమైపోయాయి. వీటిని ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తు తక్కువగా ఉన్నవారికి లో వెయిస్ట్ లెగ్గింగ్స్, పొడుగ్గా ఉన్న వారికి హై రైజ్ లెగ్గింగ్స్ నప్పుతాయి. పొట్ట ఉంటే బాడీ షేపర్ లెగ్గింగ్స్ ఎంచుకోవాలి. సీమ్ లెస్ లెగ్గింగ్స్ నీటుగా కనిపిస్తాయి. పూలు, ప్రింట్లున్నవి బావుంటాయి. లైక్రా, నైలాన్, రేయాన్ రకాలు మన్నికగా ఉంటాయి.
News October 15, 2025
ఈనెల 16న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాబ్ మేళా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 16న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఓ ప్రవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తీ చేసి అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి, యువకులు తమ బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జిల్లాలోని ఎంప్లాయీమెంట్ ఆఫీస్లో సంప్రదించాలని తెలిపారు.