News November 17, 2024
చండ్రుగొండ: గుడికి వెళ్లోస్తూ రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు మృతి

చండ్రుగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14629552>>తండ్రీకొడుకు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంకి చెందిన సతీశ్ కుమార్(43) అయ్యప్ప మాల ధరించాడు. కాగా నిన్న వారు భద్రాచలంలో సీతారాముల దర్శనానికి బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొంది. ఈప్రమాదంలో తండ్రీకొడుకుల తలలు పగిలిపోవడంతో స్పాట్లోనే మృతిచెందారు.
Similar News
News November 12, 2025
87% బిల్లులు డిజిటల్తోనే: ఖమ్మం ఎస్ఈ

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్లైన్లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్లైన్లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.


