News March 29, 2024
చంద్రబాబుకు రాచమల్లు బహిరంగ లేఖ

TDP ప్రభుత్వ హయాంలో 2014 – 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి చేశారో TDP అధినేత చంద్రబాబునాయుడు చెప్పాలని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు TDP ఇన్ఛార్జ్గా వరదరాజుల రెడ్డి ఉన్నారన్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
Similar News
News November 18, 2025
కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.
News November 18, 2025
కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.
News November 18, 2025
ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.


