News March 29, 2024

చంద్రబాబుకు రాచమల్లు బహిరంగ లేఖ

image

TDP ప్రభుత్వ హయాంలో 2014 – 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి చేశారో TDP అధినేత చంద్రబాబునాయుడు చెప్పాలని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు TDP ఇన్‌‌ఛార్జ్‌గా వరదరాజుల రెడ్డి ఉన్నారన్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

Similar News

News December 17, 2025

కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

image

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 17, 2025

కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

image

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్‌లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.

News December 16, 2025

కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ?

image

కడప జిల్లా TDP అధ్యక్షుడి రేసులో ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు TDP ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన టికెట్‌ను త్యాగం చేయడం, అలాగే అవినాశ్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన భూపేశ్‌కు పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు తీసుకొని నడిపించిన వాసునే కొనసాగించాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.