News September 19, 2024

చంద్రబాబును కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు

image

అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.

Similar News

News December 11, 2025

భీమవరం: ‘జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ’

image

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ అన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఇంధన పొదుపు భాగంగా గురువారం వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

News December 11, 2025

మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

image

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News December 11, 2025

భీమవరం: ‘స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలి’

image

స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే ఏపీ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి ఏర్పాటైందని
ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా శేషగిరిరావు అన్నారు. గురువారం భీమవరంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో మన వాటా 2 శాతం మాత్రమే ఉందని, రానున్న కాలంలో 10 శాతానికి పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.