News June 5, 2024

చంద్రబాబును కలిసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి

image

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కూటమి ఘనవిజయం సాధించేలా కృషి చేసినందుకు చంద్రబాబుకు మాగుంట ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట కొడుకు రాఘవరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. అనంతరం సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా మాగుంట కలిశారు.

Similar News

News September 19, 2025

దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

image

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.

News September 19, 2025

తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

image

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.

News September 19, 2025

నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

image

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.