News July 16, 2024
చంపుతామంటూ బెదిరింపు కాల్స్: దువ్వాడ శ్రీనివాస్

టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు అజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.
Similar News
News October 30, 2025
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 30, 2025
శ్రీకాకుళం: 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం

తుఫాన్ వర్షాలు కారణంగా జిల్లాలో 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చేతికి అంది వచ్చిన పంట నేలవాలిందని, కొన్నిచోట్ల నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి తుది అంచనా సిద్ధం చేస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారుక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
News October 30, 2025
ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.


