News March 1, 2025
చట్టానికి లోబడి బాధితులకు న్యాయం చేయండి: సీపీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్ల వారీగా సమీక్ష జరిపారు.
Similar News
News September 18, 2025
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

సంతకవిటి పోలీస్ స్టేషన్లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.
News September 18, 2025
కొండాపూర్: గులాబీ మొక్కకు పూసిన విద్యుత్ దీపాలు

కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక గులాబీ మొక్కకు పువ్వులకు బదులుగా నక్షత్రాలు వికసించినట్లుగా ఆ చిత్రం ఉంది. గులాబీ మొక్కకు దూరంలో ఉన్న రెండు ఇళ్ల విద్యుత్ దీపాలు కెమెరాకు ఇలా కనిపించాయి. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది వీద్యుత్ దీపాలు గులాబీ మొక్కకు వికసించినట్లు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
News September 18, 2025
VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.