News October 21, 2024
చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించండి: ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఆర్జీలు ఎస్పీకి అందజేశారు. ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. వేగవంతంగా సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News February 23, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


