News January 12, 2025

చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదు: ఎస్పీ

image

పండగ పేరుతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పండగ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ ఇచ్చిన తగు సూచనలతో పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సంక్రాంతి పండగను జిల్లా ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.

News December 6, 2025

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

image

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.