News April 7, 2025

చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

image

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.

Similar News

News December 20, 2025

ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు

image

TG: న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్‌కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.

News December 20, 2025

కరీంనగర్: రూ.253.56 కోట్ల మందు తాగేశారు

image

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ ఏరులై పారింది. మొదటి విడత నామినేషన్లు మొదలుకొని చివరి విడత రిజల్ట్ వరకు పల్లెలు మద్యం నిషాతో మత్తెక్కాయి. ఉమ్మడి KNRలో 2025 DEC 1-19 మధ్య కేవలం 19 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.253.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. KNR రూ.89.89 కోట్లు, PDPL రూ.58.30 కోట్లు, SRCL రూ.42.83 కోట్లు, JGTL రూ.62.54 కోట్ల మందు IML డిపో నుండి డిస్పాచ్ అయింది.

News December 20, 2025

సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

image

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.