News April 7, 2025

చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

image

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.

Similar News

News December 19, 2025

నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

image

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.

News December 19, 2025

మరికల్: ఆ పల్లెకు సర్పంచ్‌లుగా నాడు తల్లి.. నేడు తనయుడు

image

మరికల్ మండలం వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీలో తల్లి వారసత్వాన్ని కుమారుడు నిలబెట్టుకున్నారు. 2019లో ఈ పంచాయతీ నూతనంగా ఏర్పడగా, తొలి సర్పంచ్‌గా కళావతమ్మ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆమె తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై 111 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తల్లి హయాంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

News December 19, 2025

రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.